Saturday, September 21, 2024
HomeతెలంగాణBhatti Vs Singireddy: కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం

Bhatti Vs Singireddy: కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సంధర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సింగిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే, యువత బలిదానాలు చేస్తుంటే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణ కావాలని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర, పాలమూరు రంగారెడ్డికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. 263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంను వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల దగ్గర నుండి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్ వందల కేసులను ఎదుర్కొని పాలమూరు రంగారెడ్డి పనులను తుది దశకు తీసుకువచ్చాం భట్టి విక్రమార్క ఏం జరింగిదో ? ఏం జరుగుతున్నదో ? తెలుసుకుని మాట్లాడాలి పాలమూరు వలసలు, ఆకలి చావులకు కారణమే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టుపట్టించిందని, పోతిరెడ్డిపాడు పొక్కపెట్టి పాలమూరు పొట్టగొట్టింది, జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు దశాబ్దాల పాటు సాగదీసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చాకనే జూరాల నుండి పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందుతున్నాయన్నారు.

- Advertisement -

కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఆయా ఎత్తిపోతల పథకాలలో నిలిచిపోయిన పనులు కూడా కాంగ్రెస్ పాలన పుణ్యమేనన్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం .. కాంగ్రెస్‌ ఎంపీలు ఒక్కనాడన్నా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా ? పాలమూరు గురించి, ప్రాజెక్టుల గురించి భట్టి విక్రమార్క ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .. లేకుంటే పోయేది కాంగ్రెస్ పరువేనన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సంధర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News