Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: జగదీష్ రెడ్డి విద్యుత్ గుత్తే దారుల భేటీ

Hyd: జగదీష్ రెడ్డి విద్యుత్ గుత్తే దారుల భేటీ

యల్ ఓ సి బిల్లుల మంజూరు తో పాటు జీ యస్ టి మొత్తలా విషయమై రాష్ట్ర విద్యుత్ గుత్తే దారుల సంఘం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు అర్థ గంట సేపు మంత్రి జగదీష్ రెడ్డితో సమావేశం అయిన గుత్తే దారుల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి సానూ కులంగా స్పందిస్తూ అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి యల్ ఓ సి లను విడుదల చేయాలని ఆదేశించారు. మంత్రి జగదీష్ రెడ్డి అదేశానుసారం సాయంత్రానికి యల్ ఓ సి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగదీష్ రెడ్డిని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి యస్. కే. మాజిద్, పర్వతాలు, యాదయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్,స్వామి , ఇషాక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News