Sunday, October 6, 2024
HomeతెలంగాణTandur: పల్లె పల్లెకు 'పట్నం'

Tandur: పల్లె పల్లెకు ‘పట్నం’

కార్యకర్తలే నా బలం, ప్రజలే నా బలగం అంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పల్లె పల్లెలకు పట్నం కార్యక్రమం అంటూ తాండూర్ గడ్డ పైన సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారని పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సన్నిహిత అనుచరులు మాట్లాడుతూ పట్నం మహేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలుసని గుర్తు చేశారు. మహేందర్ రెడ్డి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమం ప్రారంభిస్తున్నారని సమాచారం అందుకున్న సొంత పార్టీ నాయకులకు ముందుగానే గుబులు పుట్టిందని తెలిపారు. తాండూర్ ప్రజలు వర్గపోరును సహకరిస్తున్న నాయకుల మాటలు విని మోసపోతున్నారని నిజానికి ఎవరు తాండూరును అభివృద్ధి చేశారని అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికీ మరియు బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి మాత్రమే అందించడానికి, తాండూరు అభివృద్ధి లక్ష్యంగా అధిక నిధులు సీఎం కేసీఆర్ సహాయంతో తీసుకువచ్చి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. తాండూర్ ప్రజలు గత ఎన్నికల్లో నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే పార్టీ మారి మోసం చేసిన వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని గుర్తు చేశారు .పట్నం మహేందర్ రెడ్డి పార్టీ వీడడు, పార్టీకి మోసం చేయడు, బిఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాడు అని స్పష్టం చేశారు. తొందర్లోనే పల్లెకు పట్నం కార్యక్రమంలో పాల్గొని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించి తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News