Friday, September 20, 2024
HomeతెలంగాణBalanagar: ఆవుల రవీందర్ రెడ్డి పాదయాత్ర

Balanagar: ఆవుల రవీందర్ రెడ్డి పాదయాత్ర

బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి వివిధ విభాగాల అధికారులతో పాదయాత్ర చేపట్టారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు వివిధ విభాగాల అధికారులతో కలిసి బాలానగర్ కార్పొరేటర్‌ ఆవుల రవీందర్ రెడ్డి రాజు కాలనీలో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరిస్తూ స్థానికులలో అవగాహన కల్పించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అందుబాటులో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి AE రషీద్, ఎలక్ట్రికల్ AE మొహమ్మద్ అక్బర్,వాటర్ వర్క్స్ సిబ్బంది తోపాటు రాజు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక BRS పార్టీ నాయకుల ఇతర అధికారులు స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News