Friday, September 20, 2024
HomeతెలంగాణThalasani: కమిటీల లక్ష్యం అభివృద్ధే

Thalasani: కమిటీల లక్ష్యం అభివృద్ధే

అభివృద్దే లక్ష్యంగా బస్తీ, కాలనీ కమిటీ లు పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ లో నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అర్జున్ గౌడ్ మంత్రిని శాలువాలతో సన్మానించారు. నూతనంగా ఎన్నుకోబడిన సాయిబాబా నగర్ కమిటీ సభ్యులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, కమిటీ సభ్యులు జనరల్ సెక్రెటరీ జి.నరసయ్య, ట్రెజరర్ ఏస్ రాజారామ్, శ్రీనివాస్ గౌడ్, సురేష్ గౌడ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News