Friday, September 20, 2024
HomeదైవంIllandukunta: సీతారామచంద్రస్వామి గుడికి లక్ష విరాళం

Illandukunta: సీతారామచంద్రస్వామి గుడికి లక్ష విరాళం

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అన్నదానం చేయడం కోసం జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన వేముల మహేష్ – కవిత రాణి దంపతులు 1,00,016ల చెక్కును ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ మహేష్ కవిత రాణి దంపతులను శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరచార్యులు, నవీన్ శర్మ, ఆలయ సిబ్బంది రాజయ్య, మోహన్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News