Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: బాధితులకు న్యాయం

Mahabubabad: బాధితులకు న్యాయం

‘ప్రజావాణి’లో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వీకరించారు. ఆయా ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 2:00 గంటల వరకు ఫిర్యాధు దారుల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి అందుబాటులో ఉంటానని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News