Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: నీతిఆయోగ్‌ భేటీపై జగన్ చర్చ

AP: నీతిఆయోగ్‌ భేటీపై జగన్ చర్చ

మే 27 వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్ సమీక్ష జరిపారు. సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మీ, వ్యవసాయ, సహకార శాఖల స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి కోటేశ్వరరావు , ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, వైద్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వినోద్‌ కుమార్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి విజయసునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భేటీలో ఈ కింది విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది..

- Advertisement -

వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, మరియు సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై చర్చించనున్న నీతిఆయోగ్‌ పాలక మండలి. నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరనున్న రాష్ట్రం. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనున్న రాష్ట్రం. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్ష సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై వివరించనున్న రాష్ట్రం.
ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ల్‌ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇదే సమయంలో అధికారులకు కీలక అదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్‌ చేయడం అన్నది చాలా ముఖ్యమన్న సీఎం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్న సీఎం. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం. తల్లి గర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్‌ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్న సీఎం. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి సులభతరం అవుతుందన్న సీఎం. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్‌ చేయడం కూడా సులభతరం అవుతుందన్న సీఎం.

మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్న రాష్ట్రం. బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని వివరించనున్న రాష్ట్రం. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏరకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో వివరించనున్న రాష్ట్రం. మహిళా సాధికారిత దిశలో చేయతతోపాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను వివరించనున్న రాష్ట్రం. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించనున్న రాష్ట్రం.
దాదాపు 30వేలకుపైగా ఇంటర్‌వెన్షన్స్‌ జరిగిన విషయాన్ని హైలెట్‌ చేయనున్న రాష్ట్రం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవలన్న సీఎం. ప్రతి జిల్లాకేంద్రంలో కూడా ఒక స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్న సీఎం. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలన్న సీఎం.

ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించనున్న రాష్ట్రం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్‌ రంగంలో సాధించిన ప్రగతిని వివరించనున్న రాష్ట్రం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనున్న రాష్ట్రం. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని వివరించనున్న రాష్ట్రం. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని వివరించనున్న రాష్ట్రం.
కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ ప్రస్తావించనున్న కేంద్రం. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం. బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలన్న సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News