Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: చంద్రబాబుతో మల్లికార్జున చౌదరి భేటీ

Aluru: చంద్రబాబుతో మల్లికార్జున చౌదరి భేటీ

హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో వైకుంఠం మల్లికార్జున చౌదరి భేటి అయ్యారు. అనంతరం నియోజకవర్గ రాజకీయ అంశాలపై చర్చించి నియోజకవర్గంలో పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు. మీ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గంలో నారా లోకేష్, యువగళం పాదయాత్ర విజయవంతం చేశామని, రాబోయే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని 25 సంవత్సరాల చరిత్రను తిరగ రాస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేంద్రప్ప, రాతన మనోహర్ చౌదరి, ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News