Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: తాండూరుకు నిధుల వర్షం

Tandur: తాండూరుకు నిధుల వర్షం

తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు తాండూరులోకి వచ్చే ప్రధాన రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసేందుకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే బస్టాండ్ నుంచి సెయింట్ మర్క్స్ స్కూల్ వరకు రోడ్డు విస్తరించి అభివృద్ధి చేసిన రోడ్డుకు ఇరు వైపులా బిటీ రోడ్డు నుంచి వర్షపు నీటి డ్రైన్ వరకు బిటి రోడ్డు నిర్మాణం తో పాటు పట్టణ సుందరికరణ కు రూ.25 కోట్ల ను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. జీవో 217ని ఆర్అండ్ బి జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖంజాపూర్ నుంచి విలియమూన్ వరకు ఉన్న రోడ్డును అభివృద్ధి చేసి ఇరు వైపులా డ్రైన్ నిర్మాణంకు రూ.5.20 కోట్లు విడుదల చేసింది.
అదేవిధంగా అంతారం రోడ్డు మార్గంలోని పాల కేంద్రం నుంచి అంతారం గ్రామం దాటిన తరువాత వచ్చే బైపాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణంకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆర్అండ్ బి శాఖ జీవో 237 జారీ చేసింది. తాండూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి, ఆర్అండ్ బి శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News