Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: పెద్దమ్మ సేవలో గంగుల, కిషోర్

Allagadda: పెద్దమ్మ సేవలో గంగుల, కిషోర్

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో నూతన విగ్రహ, ధ్వజ స్థంభం ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో శాసన సభ్యుల గంగుల బ్రిజెంద్రా రెడ్డి. వైఎస్ఆర్సిపి నాయకులు బద్రి సుధాకర్ రెడ్డి బద్రి భాస్కర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ చేరుకోగానే ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండలంలోని జి జంబులదిన్నె గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి గ్రామ వైఎస్ఆర్సిపి నాయకుల ఆహ్వానం మేరకు గంగమ్మ జాతరకు విచ్చేసి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనకు అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేసి ఆశీర్వదించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. దొర్నిపాడు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాలంటీర్లను సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించిన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అభినందనీయమని ప్రతి నెల ఒకటో తేదీ వస్తే చాలు అవ్వ తాతలకు ప్రభుత్వం తరఫున మీరు అందించే కానుక సంజీవని లాంటి ఔషధం అని కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం మన ప్రభుత్వానికి ఎంత అవసరమో మీరు మీ సేవల ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందాల్సిన అవసరం ఉంటుందని ఎమ్మెల్యే గంగుల తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథరెడ్డి జడ్పిటిసి శకుంతలమ్మ భూమా చెంచు రెడ్డి అమ్మి రెడ్డి నగరం సర్పంచు చంద్రశేఖర్ రెడ్డి బత్తుల నాగేశ్వర యాదవ్ మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

భూమా కిషోర్ రెడ్డి పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆత్మీయ విందులో పాల్గొన్నారు. అంబటి మహేశ్వర రెడ్డి.నాగిరెడ్డిపల్లె శంకర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి సర్వాయిపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల లో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ సీతారామ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News