Friday, September 20, 2024
HomeతెలంగాణSuryapet: 'బస్తీ దవాఖాన' ప్రారంభించిన హరీష్, జగదీశ్వర్ రెడ్డి

Suryapet: ‘బస్తీ దవాఖాన’ ప్రారంభించిన హరీష్, జగదీశ్వర్ రెడ్డి

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు రామాపురంలో రాష్ట్ర ఆర్థిక శాఖ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 13 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన ప్రారంభించారు. అంతకుముందు నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిజె సౌండ్లతో, డప్పు కళాకారుల బృందంతో మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల కోసం బస్తి దవాఖాలు ప్రారంభించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడుతున్నాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మూడవసారి కూడా ప్రజలు బిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని,మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. రాష్ట్రంలో 40, 50 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారని చెప్పారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలే బిఆర్ఎస్ ని గెలిపిస్తాయని అన్నారు. అనంతరం బస్తీ ధవాఖాన వైద్యాధికారి వంశీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట జెడ్పీ చైర్మన్ గుజ్జల దీపిక యుగేందర్, తాసిల్దార్ వి.సరిత, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ లకుమల్ల జ్యోతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, ఆర్పీలు, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News