ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , డాక్టర్ మట్టా రాగమయి , ఖమ్మం జిల్లా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్, గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రె , TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు మట్టా దంపతులు.