Friday, September 20, 2024
HomeతెలంగాణPatancheru: నీటి సమస్యపై ఎమ్మెల్యే పోరాటం

Patancheru: నీటి సమస్యపై ఎమ్మెల్యే పోరాటం

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు అమీన్పూర్ మండలం, పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీలో నెలకొన్న మంచినీటి సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి ఎండి దాన కిషోర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో ఎండి దాన కిషోర్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్ వివిధ అంశాలపై చర్చించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు మంచినీటిని అందించేందుకు గాను ఇప్పటికే మూడు రిజర్వాయర్ల పనులు ప్రారంభించామని, వీటిని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీకి సైతం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉచితంగా మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండీ దాన కిషోర్ త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News