Friday, September 20, 2024
HomeతెలంగాణSunke Ravi: రైతును రాజు చేయటమే మా టార్గెట్

Sunke Ravi: రైతును రాజు చేయటమే మా టార్గెట్

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతు వేదికలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదొండి మండలం ఆర్నకొండ, వెదురుగట్ట, గుమ్లాపూర్, రుక్మాపూర్, చొప్పదండి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. రైతులందరూ ఒకే దగ్గర కూర్చుని పంట విధివిధానాలపై చర్చించే వేదిక రైతు వేదిక అన్నారు. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని, నాడు వ్యవసాయమే దండగ అన్నారు.కానీ ఇప్పుడు వ్యవసాయమే పండుగ చేసు కుంటున్న రైతులు అని అన్నారు. రైతులకు వ్యతిరేక ప్రభుత్వం బిజెపి కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఎంపీపీలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News