Sunday, October 6, 2024
Homeనేషనల్Kejriwal: బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిందే

Kejriwal: బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిందే

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌ప్పుప‌ట్టారు. ఇది ఢిల్లీ స‌మ‌స్య కాదు.. ఇది ప్ర‌జ‌ల స‌మ‌స్య అని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన త‌ర్వాత నిర్వ‌హించిన ప్రెన్‌కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఢిల్లీకి స‌హ‌కారం అందించిన తెలంగాణ సీఎంకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఢిల్లీ ప్ర‌జ‌ల త‌ర‌పున తాను ధ‌న్యవాద‌లు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

సుప్రీంకోర్టు ఆదేశాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి… ఆర్డినెన్స్ తేవ‌డం అంటే న్యాయం కోసం ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్తార‌ని ఆయ‌న అడిగారు. ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ఇది అవ‌మానించ‌డ‌మే అన్నారు. ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల స‌మ‌స్య కాదు, ఇది దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య అన్నారు.

సీబీఐ, ఈడీలతో బెదిరిస్తూ.. ప్ర‌భుత్వాల‌ను కూల్చివేస్తున్నార‌ని బీజేపీపై కేజ్రీ ఆరోప‌ణ‌లు చేశారు. నాన్ బీజేపీ స‌ర్కార్ల‌ను కూల్చివేయ‌డం బీజేపీకి అల‌వాటు అయ్యింద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా తాను ప్ర‌జ‌ల త‌ర‌పున తిరుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ గ‌వ‌ర్న‌రే పాల‌న చేయాల‌నుకుంటే, అప్పుడు ముఖ్య‌మంత్రిని ఎన్నుకోవాల్సి అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్క‌టి అయితేనే బీజేపీ ఢీకొట్ట‌గ‌ల‌మ‌న్నారు. దేశ ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపాల‌న్నారు. ఆజాదీని ర‌క్షించుకోవాలంటే మోదీని ఓడించాల‌ని కేజ్రీ పిలుపునిచ్చారు.

దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పోరాటం చేస్తున్న‌ట్లు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ తెలిపారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జ‌రుగుతోంద‌ని, కానీ అక్క‌డ చేసేది ఏమీలేద‌ని, అందుకే తాము ఆ మీటింగ్‌ను బ‌హిష్క‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మీటింగ్‌ల‌ను త‌మ‌కు న‌చ్చిన‌ట్లే నిర్వ‌హిస్తున్నార‌ని భ‌గ‌వంత్‌మాన్ విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News