Saturday, September 21, 2024
HomeతెలంగాణHusnabad: అభివృద్ధికి చిరునామా మన ప్రభుత్వం

Husnabad: అభివృద్ధికి చిరునామా మన ప్రభుత్వం

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువత 20 మంది ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ఒకప్పుడు మెట్ట ప్రాంతం అని కానీ, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారిందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై యువత బిఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News