Saturday, September 21, 2024
HomeఆటHyd: బాక్సర్ హుస్సాముద్దిన్ ను అభినందించిన వేముల

Hyd: బాక్సర్ హుస్సాముద్దిన్ ను అభినందించిన వేముల

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ హుస్సాముద్దిన్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ మంత్రుల సముదాయంలో తన అధికారిక నివాసంలో మంత్రిని హుస్సాముద్దిన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హుస్సాముద్దిన్ కు మంత్రి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో మరింతగా రాణించాలని నిజామాబాద్ గడ్డ, తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలని కాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News