Friday, September 20, 2024
HomeతెలంగాణBhuvangiri: 'దశాబ్ది ఉత్సవాల' సన్నాహక సమావేశం

Bhuvangiri: ‘దశాబ్ది ఉత్సవాల’ సన్నాహక సమావేశం

భోనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధిలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, భోనగిరి యాదాద్రి జెడ్ పి ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, నోముల భగత్, యన్. భాస్కర్ రావు, బోల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి,టేస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లతో పాటూ కార్పొరేషన్ చైర్మన్లు సోమా భరత్ కుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ , పల్లే రవికుమార్, రాజీవ్ సాగర్, తిప్పన విజయసింహా రెడ్డి, రామకృష్ణా రెడ్డి, రామచంద్ర నాయక్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.

- Advertisement -

సన్నాహక సమావేశంలో పాల్గొన్న నల్లగొండ , యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, పమేలా సత్పతి, వెంకట్రావు లతో పాటు మూడు జిల్లాల పోలీస్ అధికారులు అపూర్వ రావు, రాజేంద్ర ప్రసాద్, రాజేష్ తదతరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News