Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: సీఎం టూర్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Pathikonda: సీఎం టూర్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

వైఎస్సార్ రైతు భరోసా సంధర్బంగా కర్నూలు జిల్లా పత్తికొండకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో పత్తికొండ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ పలు సూచనలు, సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పత్తికొండలో ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ -టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిపాడ్, బహిరంగ సభ సమావేశ ప్రాంగణం తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సున్నితంగా వ్యవహరించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. చేయకూడనవి, చేయవలసిన వాటికి గురించి తెలిపారు. అనంతరం సిఎం కాన్వాయ్ రిహార్సల్స్ ను, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి బహిరంగ సభ వద్ద భద్రత ఏర్పాట్ల ను జిల్లా కలెక్టర్ డా. జి. సృజన, జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ కలిసి పరిశీలించారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు 19 మంది డిఎస్పీలు, 57 మంది సిఐలు,119 మంది ఎస్సైలు, 473 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 815 మంది కానిస్టేబుళ్ళు, 70 మంది మహిళా పోలీసులు, 396 మంది హోంగార్డులు, 02 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 02 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News