Saturday, October 5, 2024
Homeనేషనల్Himachal Pradesh : హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ ల మ‌ధ్య హోరాహోరీ

Himachal Pradesh : హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ ల మ‌ధ్య హోరాహోరీ

Himachal Pradesh : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మొత్తం 68 స్థానాలకు న‌వంబ‌ర్ 12న ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్క‌డ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 35 మంది స‌భ్యుల సంఖ్యా బ‌లం అవ‌స‌రం. ప్ర‌స్తుతం వెలువ‌డుతున్న ఫ‌లితాల్లో కాంగ్రెస్‌, బీజేపీ ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ 34, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ఆశ‌ప‌డిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు ఖాతా తెర‌వ‌లేదు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిని మొద‌లుపెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆప‌రేష‌న్ లోట‌స్ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేల‌ను త‌ర‌లించాల‌నే యోచ‌న‌లో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌ను గురువారం సాయంత్రానికి రాజ‌స్థాన్‌కు బ‌స్సుల్లో త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఈ బాధ్య‌త‌ల‌ను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. హిమాచల్ ప్ర‌దేశ్‌లోని ప‌రిస్థితుల‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ మ‌ద్యాహ్నం ఆమె సిమ్లాకు చేరుకుంటార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News