Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుDuvvada Train Incident : చికిత్స పొందుతూ ఎంసీఏ విద్యార్థిని మృతి

Duvvada Train Incident : చికిత్స పొందుతూ ఎంసీఏ విద్యార్థిని మృతి

విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో నిన్న రైలు- ప్లాట్ ఫాం కి మధ్య ఓ విద్యార్థిని ఇరుక్కుపోయింది. స్లో గా వెళ్తున్న ట్రైన్ నుండి దిగుతూ.. ప్రమాద వశాత్తు విద్యార్థిని శశికళ జారిపడిపోయింది. వెంటనే రైలు ను ఆపి.. ఆ విద్యార్థినిని బయటికి తీసేందుకు ప్రయాణికులు తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ.. విద్యార్థిని నొప్పి భరించలేక పెట్టిన ఆర్తనాదాలు.. చూపరులనే కాదు నెటిజన్ల చేత కూడా కంటతడి పెట్టించింది. ఆమెను బయటికి తీసేందుకు ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. సాధ్యంకాకపోవడంతో రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు.

- Advertisement -

వెంటనే స్పందించిన సిబ్బంది.. విద్యార్థినిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో ఆ ప్రాంతంలో ప్లాట్ ఫారమ్ ను పగలగొట్టి రెండుగంటల పాటు కష్టపడి ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. కానీ.. విద్యార్థిని నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అవయవాల్లో అంతర్గత రక్తస్రావమై ఎంసీఏ విద్యార్థిని శశికళ కన్నుమూసింది. గంటల తరబడి నరకం చూసి.. చికిత్స పొందుతూ చనిపోయిన శశికళ ఆత్మకు శాంతి చేకూరాలని తోటి విద్యార్థులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

https://www.instagram.com/reel/Cl2vS_BpMNM/?igshid=YmMyMTA2M2Y=

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News