Sunday, September 22, 2024
HomeతెలంగాణIbrahimpatnam: బస్తీ దవాఖానలు ప్రారంభించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

Ibrahimpatnam: బస్తీ దవాఖానలు ప్రారంభించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు

ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగానూర్ లో బస్తీ దవాఖాన, మహిళా భవనము, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూర్ లో బస్తీ దవాఖానను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు అనురాధ, స్వప్న, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు హరిత, సంపూర్ణ, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్, కౌన్సిలర్లు, కమిషనర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News