Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Budda: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Budda: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరిగిన బుడ్డా రాజశేఖర్

అప్పుల పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి లోకి తేవాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం, రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని గరీబ్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ, వైసిపి ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ, టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఏమి మేలు జరిగింది, జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఏం జరిగిందో వ్యత్యాసం గమనించాలంటూ ప్రజలను బుడ్డా కోరారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత చంద్రబాబుదని, గ్రామ, పట్టణ, జిల్లా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించి, అన్ని కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు రుణాలు, వాహనాలు అందజేసి వారి అభివృద్ధికి సహకరించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, నిత్యవసర సరుకులు,పెట్రోలు, డీజిల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని బుడ్డా తెలిపారు. అలాగే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు చార్జీలను అనేకసార్లు పెంచి ప్రజలపై భారం మోపారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని వైసిపి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని బుడ్డ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ వలి, మురళి, మల్లె వినోద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News