Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya: కార్యకర్త శ్రమనే పార్టీకి జయకేతనం

Kale Yadayya: కార్యకర్త శ్రమనే పార్టీకి జయకేతనం

దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బిఆర్ఎస్

బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గులాబీ పార్టీ చేవెళ్ల పట్టణ అధ్యక్షుడిగా జూకంటి జైపాల్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జూకంటి జైపాల్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. దేశంలోనే అత్యధిక సభ్యత్యాలు కలిగిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త శ్రమతో కూడిన బలమే పార్టీ పురోగతికి కీలకమన్నారు. నూతనంగా ఎన్నుకున్న పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలో అందరితో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గుడి పల్లి రవికాంత్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్ ఆలూరు ఉపసర్పంచ్ వెంకటేష్ రవికాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News