Monday, September 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: దమ్ము-ధైర్యం జగనన్న ప్రభుత్వానికే సాధ్యం

Gangula: దమ్ము-ధైర్యం జగనన్న ప్రభుత్వానికే సాధ్యం

రాష్ట్ర అభివృద్ధి జగనన్న ప్రభుత్వంతోనేనని తెలిపారు

దమ్ము ధైర్యం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమైందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాగలమర్రి మండల కేంద్రంలో 1వ వార్డులో ఎమ్మెల్యే గంగుల, ఏపీ ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ బాబూలాల్ ,ఎంపీపీ వీరభద్రుడు, వైసిపి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకుడు పత్తి నారాయణ, వార్డు కౌన్సిలర్ షబ్బీర్, వైయస్ సర్పంచ్ సోహైల్, గణేష్ రెడ్డి, లతో కలిసి గడపగడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల అందరూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బుక్లేట్ ద్వారా వాటిని క్షుణ్ణంగా వివరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ఇంకా అర్హులై ఉండి పథకాలు అందని వారు ఉంటే తెలపాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న ప్రజలే టిడిపి అపద్ధపు ప్రచారాలను గతంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన విషయాన్ని గమనించాలని జగనన్న ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ 98% పూర్తి చేసిన మాటవాస్తవం కాదా అని ప్రజలను అడిగారు. టిడిపి నాయకులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జగనన్న ప్రభుత్వంతోనేనని తెలిపారు. మాట ఇచ్చిమడమ తిప్పని నాయకుడిగా దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అందుకు మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఇవ్వాలనిఎమ్మెల్యే గంగుల అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News