Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: టిడిపి వాల్మీకి సమాఖ్య పర్యటన

Aluru: టిడిపి వాల్మీకి సమాఖ్య పర్యటన

ఆలూరు పట్టణంలో కొట్టాల వీధిలో వాల్మీకి బోయ సోదర సోదరీమణులను అడిగి వారి స్థిగతులు తెలుసుకున్న బృందం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆశీస్సులతో వాల్మీకి బోయ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు సూచన మేరకు ఆలూరు నియోజకవర్గ వాల్మీకి-బోయ సాధికారత కమిటీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు భాస్కర్ నాయుడు ఆద్వర్యంలో జిల్లా బిసి సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు పర్యటించారు.

- Advertisement -

ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గం ఆలూరు పట్టణంలో కొట్టాల వీధిలో వాల్మీకి బోయ సోదర సోదరీమణులను అడిగి వారి స్థిగతుల గురించి చర్చించారు. నాయకులు మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో రాష్ట్ర మొత్తం వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. అయితే ప్రస్తుత జగన్ ప్రభుత్వం వాల్మీకి బోయలను ఓటు కోసం మాత్రమే వాడుకొని, వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News