Friday, September 20, 2024
HomeతెలంగాణBrahmanapalli: ఘనంగా పొచమ్మ బోనాలు

Brahmanapalli: ఘనంగా పొచమ్మ బోనాలు

అమ్మవారికి బోనం సమర్పించిన పాలకుర్తి జడ్పీటిసి కందుల సంధ్యారాణి

బ్రాహ్మణ పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన పొచమ్మ బోనాల కార్యక్రమానికి పాలకుర్తి జడ్పీటిసి కందుల సంధ్యారాణి హాజరై గ్రామదేవత పోచమ్మ భోనాలను సమర్పించారు. బోనాల ఉత్సవాల సంధర్బంగా గ్రామంలోని మహిళలు అత్యంత భక్తిశ్రద్దల నడుమ బోనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాలు కార్యక్రమంలో జడ్పీటిసి కందుల సంధ్యారాణి పాల్గోని అమ్మ వారికి బోనాన్ని సమర్పించారు.
ఈ సంధర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆ ఆమ్మవారి ఆశిస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్బంగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి దుర్గం విజయ, సర్పంచ్ బండారి ప్రవీణ్, కొల్లూరి లక్ష్మణ్,సుమన్, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News