Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ ను ఓడించలేవు

Gangula: ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ ను ఓడించలేవు

ప్రజాబలం ప్రజల ఆశీస్సులు జగన్ కు ఉన్నంత వరకూ ప్రతిపక్షాలు ఓడించలేవు

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేవని మాజీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చాగలమర్రిలోని డాక్టర్ సురేష్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన మండల కో ఆప్షన్ సభ్యులు జిగ్గీ గారి ఇబ్రహీం కుమారుడు జీగ్గి ఇలియాజ్ వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భముగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా జగన్ మోహన్ రెడ్డిని ఓడించ లేడన్నారు. ప్రజాబలం ప్రజల ఆశీస్సులు జగన్ కు ఉన్నంత వరకూ ప్రతిపక్షాలు ఓడించలేరని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని ప్రజా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా మన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అలాగే చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శాసనసభ్యులు గంగుల నాని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారని ప్రజలు ఏవైనా సమస్యలుంటే తెలియజేస్తే వెంటనే పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. జగనన్న కాలనీలో లబ్ధిదారులంతా ఇండ్లు నిర్మించుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ఎంపీపీ వీరభద్రుడు, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం,మండల ఉపాధ్యక్షుడు ముళ్ళ మహ్మద్ రఫీ, చాగలమర్రి ఉపసర్పంచ్ సోహైల్, ఎంపీటీసీ ఫయాజ్, పత్తి నారాయణ, లక్ష్మి రెడ్డి, సర్పంచు లు బంగారు షరీఫ్, గోవిందయ్య, ప్రతాప్ రెడ్డి, గణేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడు గోపవరం నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి రామ్ గురువిరెడ్డి, డాబా మనోహర్ రెడ్డి ,ముల్లా ఖాదర్ బాషా,ముల్లా చక్రం షబ్బీర్, మదర్ వల్లి, అబ్దుల్లా, అబ్దుల్లాబాషా బురందినె్, వెంకట్ రమణ, దాదా బీడీ ఖాజా, షబ్బీర్, నాగేంద్ర, గేట్ల మభూసబ్, గ్యాస్ రఫీ బబ్లు, పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News