Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

Katasani: వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

వైయస్సార్ పార్టీలోకి చేరినవారందరికి సముచిత స్థానాన్ని కల్పిస్తాం

బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో అవుకు మండలం మర్రికుంట తాండా గ్రామానికి చెందిన గోపాల్ నాయక్, బాలు నాయక్, లక్ష్మా నాయక్, వెంకటేష్ నాయక్, రమేష్ నాయక్ లు టీడీపీ నుంచి వైయస్సార్ పార్టీలోకి బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్సార్ పార్టీ కండువా కప్పి వైయస్సార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ పార్టీ నుంచి వైయస్సార్ పార్టీలోకి చేరినవారందరికి సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు.

- Advertisement -


ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు. పార్టీలకు,కులాలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైయస్సార్ పార్టీలోకి చేరుతారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మళ్ళీ ముఖ్య మంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసుకోవాలి అని అప్పుడే మళ్ళీ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమం లో కునుకుంట్ల గ్రామ సచివాలయం కన్వీనర్ పురుషోత్తం నాయుడు, కంబగిరి రాముడు నాయక్, లక్ష్మా నాయక్,రాముడు నాయక్, రామాంజి నాయక్,పుల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News