Saturday, April 12, 2025
HomeతెలంగాణErrabelli: కేసీఆర్ వల్లే గిరిజన సంక్షేమం

Errabelli: కేసీఆర్ వల్లే గిరిజన సంక్షేమం

పల్లె ప్రగతితో గ్రామాలు కడిగిన ముత్యంలా తయారయ్యాయి

గిరిజనుల సంక్షేమం సీఎం కేసిఆర్ వల్లే సాధ్యమయ్యిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి తో గ్రామాలు కడిగిన ముత్యంలా తయారయ్యాయని, మాల్యా తండాలో గిరిజన సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

- Advertisement -


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజన సంక్షేమ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గం, పర్వత గిరి మండలం, మాల్యా తండాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సేవాలాల్ చిత్ర పటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించి, నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News