Friday, September 20, 2024
HomeఆటOlympic day run: క్రీడాకారులు ఒలింపిక్స్ లో రాణించేలా సాధన చేయాలి

Olympic day run: క్రీడాకారులు ఒలింపిక్స్ లో రాణించేలా సాధన చేయాలి

ప్రతి వ్యక్తి వ్యక్తిగత వ్యాయామం అలవర్చుకోవాలి

క్రీడాకారులు ఒలింపిక్ క్రీడల్లో రాణించేలా క్రీడల్లో సాధన చేయాలని దేశానికి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక , మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులు యువకులు, క్రీడాకారులు, వాకర్స్, వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని నిత్యం సమపాళ్లలో తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ప్రత్యేకించి విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండేలా వారి వారి జీవనశైలి మెరుగుపరుచుకోవాలని వారు సూచించారు.
ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తమ క్రీడాకారులుగా రాణించి జాతీయ, అంతర్జాతీయ, ఒలంపిక్ క్రీడల్లో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా ప్రతి క్రీడాకారుడు వారి వారి క్రీడల్లో సాధన చేయాలని అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వారన్నారు.
నిత్యజీవితంలో వ్యాయామం అనేది ప్రధాన భూమిక పోషిస్తోందని, ప్రతి వ్యక్తి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల రోజు రోజుకి ప్రతి వ్యక్తిలో శక్తి క్షీణిస్తున్నట్లు గమనిస్తున్నామని తిరిగి ఆ శక్తిని సాధించేందుకు పోషకాహారాన్ని తీసుకోవడమే మార్గమని అందుకోసమే అంతర్జాతీయ స్థాయిలో ఒలంపిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యక్తి వ్యక్తిగత వ్యాయామం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించిన నాడే ఒలంపిక్ డే రన్ కి సార్ధకత ఉంటుందని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక జండా ఊపి రన్ ప్రారంభించిన అనంతరం ఒలంపిక్ టార్చితో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక ఎన్టీఆర్ స్టేడియం నుండి ఒలంపిక్ రన్ మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, డి వై ఎస్ ఓ అనిల్ కుమార్, ఒలంపిక్ డే రన్ కార్యక్రమం కన్వీనర్ చాంప్లానాయక్, కో-కన్వీనర్ కల్లూరి ప్రభాకర్ రావు, క్రీడా సంఘాల బాధ్యులు వెలిశాల కుమారస్వామి, మద్ది వెంకటరెడ్డి, రాగం వీరభద్రం, శివ, వర్మ ,గోగుల రామకృష్ణ, ఇమామ్ పాషా,పుష్పలీల, అవారి శ్రీను, పద్మావతి, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ఓ జ్యోతి, మాజీ కేజీఎఫ్ సెక్రటరీ శంకర్ నాయక్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు వద్దెబోయిన శ్రీనివాస్, మహంకాళి వెంకటేశ్వర్లు, ప్రవీణ్, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, మా అసోసియేషన్ బాద్యులు మందు రఘు, కాళోజి, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ల సభ్యులు, పలువురు క్రీడాకారులు, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News