Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru BJP: విలువలతో కూడిన రాజకీయాలు ముఖర్జీకే సాధ్యం

Emmiganuru BJP: విలువలతో కూడిన రాజకీయాలు ముఖర్జీకే సాధ్యం

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకు ఘన నివాళి

దేశాభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఘనత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకే సాధ్యం అని కేంద్ర ఐటి సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్, బిజేపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సహా ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ హెచ్బీఎస్ కాలని లోని బిజేపి కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ కన్వీనర్ కేఅర్ మురహారి రెడ్డి అధ్వర్యంలో మహాజన సంపర్క్ అభియాన్ లో బాగంగా సంఘ్ పరివార్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి దేవుసిన్హ చౌహాన్, రాష్ట్ర సహా ఇంఛార్జి సునీల్ దియోదర్ లు హిందీలో మాట్లాడిన మాటలను బిజేపి ఓబీసి మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థ సారథి తెలుగులో అనువాదం చేశారు. ముఖర్జీ జీవిత చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో వీక్షించారు.

- Advertisement -

సమావేశంలో బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ, ఓబిసి మోర్చ జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థ సారథి, జోనల్ ఇంఛార్జి మురళి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, క్రమశిక్షణ కమిటీ కో కన్వీనర్ కపిలేశ్వరయ్య, మంత్రాలయం కన్వీనర్ న్యాయవాది బీ పురుషోత్తమ రెడ్డి, ఆదోని విట్టా రమేష్, డాక్టర్ వినుస రెడ్డి ఎమ్మిగనూరు బిజేపి నేతలు కేఅర్ రాజగోపాల్ రెడ్డి, కిరణ్ కుమార్, బీఎల్ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News