Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం

Gudem Mahipal: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం

అభివృద్ధి పథంలో అమీన్పూర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేసిఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని పఠాన్ చెరువు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు బహిరంగ సభలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డిని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నారాయణఖేడ్లో జరిగిన బహిరంగ సభలో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ అమీన్పూర్ మున్సిపాలిటీ కి 25 కోట్ల రూపాయలు విధులు కేటాయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే జిఎంఆర్ సలహాలు సూచనలతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు కల్పన ఉపేందర్ రెడ్డి, బిజిలి రాజు, కొల్లూరు చంద్రకళ గోపాల్, బోయిని బాలమణి బాలరాజు, కవిత శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, యూనుస్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు చౌటకూరి మహిపాల్ రెడ్డి, లింగం గౌడ్, మహేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News