Sunday, October 6, 2024
HomeతెలంగాణChevella: పైలట్ రోహిత్ రెడ్డికి ప్రజాభిమానమే శ్రీరామ రక్ష

Chevella: పైలట్ రోహిత్ రెడ్డికి ప్రజాభిమానమే శ్రీరామ రక్ష

చేవెళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం నుండి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ భగవంతుడి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో బయటపడ్డారని చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన అభిమానులు తూర్పులింగారెడ్డి అడ్వకేట్ బేగరి రామకృష్ణతో ఆధ్వర్యంలో పెద్దలు యువకులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనపై ఉన్న ప్రజాబీమానమే శ్రీరామ రక్ష అన్నారు. ఆయన క్షేమం కోరి వెంకటేశ్వర స్వామి పాదాలకు నూట ఒక్క టెంకాయలు కొట్టి పాదాభిషేకం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డికి తాండూర్ నియోజకవర్గంతో పాటు చేవెళ్ళలో కూడా ప్రజల ఆశీసులు ఉన్నాయన్నారు.

- Advertisement -

ప్రజల కోసం పాటుపడే పైలెట్ రోహిత్ రెడ్డికి ప్రజాభిమానం ఉన్నంత కాలం ఏ దుష్టశక్తి ఆయనపై వాలదన్నారు. ప్రజాభిమానమే ఆయనను ఎల్లపుడు కాపాడుతుందన్నారు. అర్ధరాత్రి పిలిస్తే పలికే రోహిత్ రెడ్డి బాగుండాలన్నారు. ఈ పూజా కార్యక్రమంలో అశోక్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్ బాయ్, నరసింహ, మహేష్ రోహితన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News