బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, కార్లతో కూడిన భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు, మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, రసమయి బాలకిషన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వెళ్ళారు.