Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్నసేవలో మంత్రులు అంబటి, ఆది మూలపు

Srisailam: మల్లన్నసేవలో మంత్రులు అంబటి, ఆది మూలపు

శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ దర్శించుకున్నారు. శ్రీస్వామి, అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రులకు ఆలయ ఈవో లవన్న, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో మంత్రి అంబటి రాంబాబుకు ఆది మూలపు సురేష్ కు ఆలయ ఈవో లవన్న, అర్చకులు, వేదపండితులు ఆశీర్వచన చేసి శ్రీస్వామి అమ్మవార్ల లడ్డులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News