Friday, April 18, 2025
HomeతెలంగాణSandra: పీవీ జయంతిలో ఎమ్మెల్యే

Sandra: పీవీ జయంతిలో ఎమ్మెల్యే

పీవీ సేవలు మరిచిపోం

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు జయంతిని పురస్కరించికొని సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పీవీ న‌ర‌సింహారావు చిత్రపటానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో పీవీ ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేశార‌ని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, పట్టణ బిఆర్ యస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, కార్యదర్శి అంకం రాజు, నాయకులూ గాదె సురేష్, గొర్ల ప్రభాకర్ రెడ్డి, అప్పారావు, నాగరాజు, నడ్డి ఆనందరావు, అబ్దుల్లా, నరసింహారావు, యలమర్తి శ్రీనివాసరావు, కోడూరి వీరకృష్ణ, చంటి, నరుకుల్ల శ్రీను, కౌన్సిలర్లు గుండ్ర రఘు, మట్ట ప్రసాద్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News