Saturday, April 19, 2025
HomeదైవంAhobilam: వైభవంగా తొలి ఏకాదశి, స్వాతి వేడుకలు

Ahobilam: వైభవంగా తొలి ఏకాదశి, స్వాతి వేడుకలు

మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే శయన ఏకాదశి

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో తొలి ఏకాదశి, శ్రీవారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారికి అమ్మవారికి వేద పండితులు అభిషేకం అష్టోత్తర శతనామాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దిగువ అహోబిలం ఆలయంలో దేవస్ధానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి అధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి అమృతవల్లి అమ్మవార్ల విగ్రహాలను విశేష పూలతో అలంకరించారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే శయన ఏకాదశి , స్వాతి రెండు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News