తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు ఆపన్నహస్తంగా సీఎం సహాయనిధి నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ముర్తుజా అలీ హుస్సేన్ కు 2లక్షల 50 వెేల రూపాయల ఎల్.ఓ.సీ చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం బారినపడి కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకోలేని పేదవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు.
రామగుండం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి 12 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను ఆరోగ్య బాధితులకు అందించామన్నారు. రామగుండం నియోజకవర్గంలో పేదవారికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటున్నామని అన్నారు.
Korukanti Chander: పేదలకు ఆపన్నహస్తం సీఎం సహాయనిధి
సీఎం సహాయ నిధి కింద ఆర్థిక భరోసా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES