Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్MLA Arthur: 'జగనన్న సురక్ష'తో అర్హులందరికీ లబ్ధి

MLA Arthur: ‘జగనన్న సురక్ష’తో అర్హులందరికీ లబ్ధి

లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు

సంక్షేమ పథకాల కోసం గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది వైసిపి అధికారంలోకి వచ్చాక ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలను గడప వద్దకే అందించగలుగుతున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ ఉద్ఘాటించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని దుద్యాలలో పాల్గొన్నారు.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న సురక్ష’ తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు అర్హులందరికీ అందాలి. వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే జగనన్న సురక్ష తీసుకొచ్చాం. అర్హత ఉండి కూడా.. చిన్నచిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూరుస్తామ”ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News