Wednesday, September 25, 2024
HomeతెలంగాణMallapur: నిశాంత్ కార్తికేయ బీజేపీని వీడడం బాధాకరం

Mallapur: నిశాంత్ కార్తికేయ బీజేపీని వీడడం బాధాకరం

నిశాంత్ పునరాలోచించాలి

కోరుట్ల నియోజకవర్గ బీజేపీ పార్టీ యువ నాయకుడు, అనతి కాలంలోనే ప్రజల మన్నల్ని పొందిన వ్యక్తి పుదారి నిశాంత్ కార్తికేయ ఈ రోజు నుండి బీజేపీ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. ఈ నిర్ణయం కచ్చితంగా భారతీయ జనత పార్టీ అధిష్టానం, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుదారి నిశాంత్ కార్తికేయతో చర్చలు జరిపి, తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, కోరుట్ల నియోజకవర్గంలో మరింత పార్టీ బలోపేతానికి కృషి జరిపించాలన్నారు. నిశాంత్ కార్తికేయ తన నిర్ణయంపై పునఃపరిశీలన చేసుకోవాలని, తిరిగి పార్టీలోకి రావాలని స్థానికులు డిమాండ్ చేశఆరు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు లవంగ శివకుమార్, శ్రీధర్ యాదవ్, వెల్మల రాజశేఖర్, బండి స్వామి, ఆంజనేయలు, ఇల్లేందుల మనోజ్ కుమార్, సురేష్, ముస్కేరి రాకేష్, కొండవతిని రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News