Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: అత్యధిక సంక్షేమ పథకాలు అందించింది మేమే

Gangula: అత్యధిక సంక్షేమ పథకాలు అందించింది మేమే

'గడప గడపకు'లో పాల్గొన్న గంగుల

ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లే గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గంగుల బ్రిజెంద్ర రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి మర్రిపల్లి తులసి రెడ్డిలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అడిగి, ఇంకా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తెలపాలని గ్రామ ప్రజలను అడిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆ కార్యక్రమంలో ఇంకా 11 రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది పేదప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం..అర్హత ఉన్న ప్రతీ పేదకుటుంబానికి సంక్షేమ అందడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం..మన రాష్ట్ర చరిత్రలో అవ్వా, తాతలకూ, వికలాంగులకు, వితంతువులకు, ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్దిని, విద్యార్దులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. ఎన్నికలు ఎనిమిది నెలల్లో ఉన్నాయని ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డేని మంచి చేసిన వారిని మంచి సహృదయంతో మీరందరూ ఆయనకు చల్లని ఆశీస్సులు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలు మాకు ఇవ్వాలని ఎమ్మెల్యే గంగుల కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ టౌన్ కన్వీనర్ గొట్లురు సుధాకర్ రెడ్డి , ఆర్.కృష్ణపురం వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణ రెడ్డి ,జగన్ మోహన్ రెడ్డి,రంగారెడ్డి ,గోపిరెడ్డి అశోక్ రెడ్డి , మర్రిపల్లె తులసిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాసులు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News