Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Acharya Shyam Upadhyay: ప్రపంచంలోనే ఏకైక సంస్కృత న్యాయవాది ఆచార్య శ్యామ్‌ ఉపాధ్యాయ్‌

Acharya Shyam Upadhyay: ప్రపంచంలోనే ఏకైక సంస్కృత న్యాయవాది ఆచార్య శ్యామ్‌ ఉపాధ్యాయ్‌

సంస్కృతంలోనే వ్యాజ్యాలు నిర్వహిస్తానని 7వ తరగతిలో శపథం

“అహం సంస్కృతం వాదామి”- ఇదేమిటి అనుకుం టున్నారా! ఈ సంస్కృత వాక్యానికి తెలుగు అర్థం “నేను సంస్కృతంలో మాట్లాడతాను” అని. భావ వ్యక్తీ కరణకు భాష మూలాధారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6900 భాషలు వాడుకలో ఉండగా అందులో 3500 సంవత్సరాల చారిత్రక ఆధారాలతో ఉనికి గల సంస్కృతం అతి ప్రాచీన భాష. సంస్కృతాన్ని దేవ వాణి, దేవ భాష, సుర భారతి అని కూడా అంటారు. సంస్కృత లిపిని దేవనాగరి అంటారు. భారత రాజ్యాంగంలోని 8వ అధికరణంలో పేర్కొన్న 22 భాషలలో అతి తక్కువగా వాడుకలో ఉన్న భాష స్థాయికి సంస్కృత భాష చేరుకుంది. సంస్కృతానికి, భారత దేశానికి గల సంబంధం అజరామరమైనదే కాక దేశంలోని అన్ని భాషలకు మాతృక లాంటిది ఈ ప్రాచీన భాష. భారతీయ సనాతన ఆధ్యాత్మిక గ్రంధాలైన రామా యణ, మహా భారత, భాగవతాలన్నీ తొలుత సంస్కృతం లోనే రచింపబడ్డాయని చరిత్ర మనకు చెబుతుంది. అంతే కాక పూర్వం విద్యాబోధన అంతా కూడా సంస్కృతం లోనే జరిగేదని, ఈ ప్రత్యేకత వల్లనే భారత దేశం ఒకప్పుడు విశ్వగురువుగా భాసిల్లిందని అంటారు. వేల సంవత్సారాల క్రితమే నలందా, తక్షశిల, శారరదా, మిథిలా, విక్రమ లాంటి వైదిక విద్యాలయాలలో సంస్కృత భాషలోనే దేశ విదేశీయులకు వివిధ శాస్త్రాలలో విద్యాబోధనను అందిం చిన విజ్ఞాన భూమి మన భారతదేశం. అయితే, కాలక్ర మంలో భారత దేశంపై వివిధ వలసవాదులు దండయా త్రలు చేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవడంతో పాటు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వారి భాషలను భార తీయులపై బలవంతంగా రుద్దడం వలన సంస్కృత భాష ప్రాభవం కాలక్రమేణా మసక బారింది. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆచార్య శ్యామ్‌ ఉపా ధ్యాయ్‌ దాదాపు గత నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ వాద వృత్తిలో కొనసాగుతూ తాను చేపట్టిన మొట్టమొదటి కేసు నుండి నేటి వరకు ప్రతి కేసును సంస్కృతంలోనే నిర్వ హించడం సంస్కృత భాష పట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనం.
బాల్యంలోనే శపథం
భారత న్యాయస్థానాలలో వాద, ప్రతివాదనలు, తీర్పులు అన్నీ సాధారణంగా ఇంగ్లీష్‌, హిందీ లేదా స్థానిక మాతృభాషలలో జరుగుతాయి తప్ప సంస్కృతంలో కాదు అని బాల్యంలోనే తన తండ్రి ద్వారా తెలుసుకున్న ఆచార్య శ్యామ్‌ ఉపాధ్యాయ్‌, భవిష్యత్తులో తాను న్యాయవాద వృత్తి చేపట్టి సంస్కృతంలోనే వ్యాజ్యాలు నిర్వహిస్తానని ఏడవ తరగతి చదువుతున్న సమయంలో చేసిన ప్రతిజ్ఞ పై నేటికీ కట్టుబడి ఉన్నారు. బాల్యం నుండి సంస్కృతంపై మక్కువ గల ఆయన ప్రపంచంలోని అతి పెద్ద సంస్కృత విశ్వవిద్యా లయాలలో ఒకటైన సంపూర్ణానంద్‌ సంస్కృత్‌ విశ్వవిద్యా లయం, వారణాసి నుండి బుద్ధిస్ట్‌ ఫిలాసఫీలో పట్టా పొం దారు. ఆ తరువాత హరిచంద్ర కాలేజ్‌ నుండి సంస్కృత మాధ్యమంలోనే బీఏ, ఎల్‌ఎల్‌ బీ పూర్తి చేసి 1978లో న్యా యవాద వృత్తిలోకి అడుగు పెట్టారు. ఒక వైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే మరో పక్క సంస్కృత భాష పరి రక్షణ కోసం ఆయన ఇతోధిక కృషి చేస్తున్నారు. ఈ నేప థ్యంలోనే ఆయన సంస్కృత భాషలో 60 నవలలు రచించ డమే కాక పిల్లలకు, ఔత్సాహికులకు పూర్తి ఉచితంగా సంస్కృతం బోధించడం శ్లాఘనీయం. అంతే కాక ఆయన ప్రతి సంవత్సరం కోర్టు ఆవరణలో సంస్కృత భాషా దినో త్సవం నిర్వహిస్తారు. ఆయన ఈ కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ 2003లో సంస్కృత మిత్రం అనే జాతీయ బిరుదుతో సత్కరించింది.

- Advertisement -


కోర్టు వ్యవహారాలన్నీ సంస్కృతంలోనే
ఆయన వద్దకు వచ్చే కేసుల పిటిషన్ల దరఖాస్తు నుంచి వాదనలు, విచారణలు, నివేదికలు, అఫిడవిట్లు అన్నీ కూడా సంస్కృతంలోనే నిర్వహిస్తారు. ఆయన వాడే భాష సరళంగా ఉండడంతో న్యాయస్థానంలో అందరికీ సులువు గా అర్థమవుతుందట. సంస్కృతంలో ఆయన వాక్పటిమను చూసి సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇత రులు మంత్రముగ్దులవుతుంటారు. అంతే కాక న్యాయ మూర్తులు సైతం ఆయన వాదించే కేసుల తీర్పులను ప్రత్యే కంగా సంస్కృతం, హిందీ భాషలలో వెల్లడించడం విశేషం. ఆయనకు కేవలం సంస్కృతం మాత్రమే తెలుసు అను కుంటే పప్పులో కాలు వేసినట్లే. సంస్కృతంతో పాటు ఆయనకు హిందీ మరియు ఇంగ్లీష్‌ భాషలలో కూడా మం చి ప్రావీణ్యం ఉంది. సంస్కృతంలో వాదనలు వినిపించిన తరువాత, న్యాయమూర్తి కోరితే, ఆయన దానిని హిందీ లేదా ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి వినిపిస్తారట. సంప్రదాయ నల్ల కోటు ధరించి నుదిటిపై త్రిపుండ్‌, తిలకంతో ఆయన న్యాయవాదులందరిలో విలక్షణంగా కనిపిస్తారు. ప్రపం చంలోనే ఏకైక సంస్కృత న్యాయవాదిగా నాలుగున్నర దశాబ్దాల నుండి కొనసాగుతున్న తన పేరును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చేర్చాలని ఆచార్య శ్యామ్‌ ఉపా ధ్యాయ్‌ కోరుతున్నారు.
సంస్కృత భాష యొక్క ప్రత్యేకతలు
సంస్కృత భాష బహుముఖమైనదే కాక ఆధునిక భాషలన్నిటికీ మాతృక లాంటిది. ఒక్కో పదానికి సంస్కృత భాషలో ఉన్నన్ని పర్యాయ పదాలు మరే ఇతర భాషలో లేవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఏనుగుకు సం బంధించి ఇంగ్లీష్‌లో కేవలం ఓకే పదం అందుబాటులో ఉండగా సంస్కృతంలో దాదాపు వంద పదాలు అందు బాటులో ఉన్నాయి. అంతే కాకుండా అతి తక్కువ పదా లను ఉపయోగించి సుదీర్ఘమైన భావాన్ని కేవలం సంస్కృ తంలో మాత్రమే వ్యక్తపర్చవచ్చు. సంస్కృత భాషను ఉచ్ఛ రించడం వలన మెదడు పని తీరు మెరుగుపడడమే కాక జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాస) పరిశోధకుడు రిక్‌ బ్రిగగ్స్‌ తన పరిశోధనా పత్రంలో నాస వారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌ (కృత్రిమ మేధస్సు) ప్రోగ్రామ్‌ కోసం కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రాచీన భారతీయ భాష అయిన సంస్కృతం అత్యంత అనుకూలమైన భాష అని పేర్కొనడం గమనార్హం. సంస్కృత భాషలో మరే ప్రపం చ భాషలలో లేని పదజాలం ఉంది. సంస్కృతం నేర్చు కున్న వ్యక్తి ప్రపంచంలోని ఇతర భాషలలోని కఠినమైన పదాలను సైతం అనాయాసంగా ఉచ్ఛరించడమే కాక సులువుగా నేర్చుకోగల్గుతారు. సంస్కృత భాషను సృష్టికర్త అయిన బ్రహ్మ కనిపెట్టి ఖగోళంలో నివసించే ఋషులకు బోధించగా దానిని వారు భూలోకంలో నివసించే వారి అనుచరులైన మానవులకు అందించారని అంటారు.
సంస్కృత భాష పరిరక్షణకు కృషి చేస్తున్న గ్రామాలు
ఆధునిక పోకడలతో వెర్రితలలు వేస్తున్న నేటి కాలం లో కూడా మాతృభాష కన్నడ అయినప్పటికీ సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని మత్తూర్‌ గ్రామం. సం స్కృత భాష పరిరక్షణ కోసం ఈ గ్రామంలోని స్థానిక పాఠ శాలలో సుమారు 5000 మందికి విద్యార్థులకు సంస్కృ తం బోధించబడడం అత్యంత సంతోషదాయకం. అధిక సంఖ్యలో విష్ణు, శైవ ఆలయాలు ఉండే ఈ గ్రామంలో ప్రతి రోజు తెల్లవారు ఝామున మహిళలు, బాలబాలికలు కలిసి నగర సంకీర్తన జరపడం మరో ప్రత్యేకత. సంస్కృత భాష ఔన్నత్యాన్ని విస్తృత పరచడానికి, 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయలు జంట గ్రామాలైన హోస హళ్లి మరియు మత్తూర్‌లను ప్రధాన కేంద్రాలుగా స్థాపించారు. అప్పట్లోనే సంస్కృతం నేర్చుకోవడానికి ప్రపంచం నలు మూలల నుండి ఈ రెండు గ్రామాలకు ప్రజలు తరలి వచ్చేలా చేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌ఘర్‌ జిల్లా నుండి దాదాపు 45 కి.మీ దూరంలో ఉన్న ఝిరి గ్రామంలోని గోడలు సంస్కృత భాషలో లిఖించబడిన సూక్తులు, నీతి వాక్యాలు, సామెత లతో విలక్షణంగా దర్శనమిస్తాయి. కేవలం 1000 మంది నివసించే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ మాతృ భాషగా సంస్కృతం మాట్లాడతారు. గ్రామంలోని వయోజ నులు స్థానిక దేవాలయాలలో పిల్లలకు చేసే సంస్కృత బోధన చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. మహిళల సం స్కృత పాటలు లేనిదే ఆ గ్రామంలో వివాహ వేడుకలు జర గవు. ఈ ప్రత్యేకతలతో మధ్యప్రదేశ్‌ సందర్శించే పర్యాట కులకు ఝిరి గ్రామం ఆకర్షణీయ కేంద్రంగా మారు తోంది. ఒడిశా రాష్ట్రం లోని పట్టముండై పట్టణానికి 29 కి మీ దూరంలో కేవలం 50 గృహాలతో 300 జనాభా ఉండే చిన్న గ్రామం శాస. ప్రధానంగా బ్రాహ్మణులు నివసించే ఈ గ్రామంలో సంస్కృత భాషకు గొప్ప స్థానముంది. ఈ గ్రామ సమీపంలో గల బాబ్‌కర్‌పూర్‌ గ్రామంలో నెలకొన్న ప్రఖ్యాత కవి కాళిదాసు ఆలయం సంస్కృత భాష పట్ల ఆ ప్రాంత వాసుల భక్తి మరియు గౌరవాన్ని సూచిస్తుంది. రాజస్థాన్‌, బన్స్వారా జిల్లాలోని గనోడా గ్రామ ప్రజలు రెండు దశాబ్దాల క్రితం వరకు సంస్కృత భాషను ఆ గ్రామంలో ప్రవేశ పెట్టే వరకు కూడా తమ ప్రాంతీయ భాష వాగాడిలో మాట్లాడుకునేవారు. కాగా పాఠశాలలు, కళా శాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టిన అనతి కాలం లోనే విద్యార్థులు సంస్కృతంలో నిష్ణాతులు అయ్యారు. కాల క్రమేణా, పెద్దలు కూడా యువకుల నుండి సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించగా నేడు గ్రామంలోని వారం దరూ సంస్కృతం మాట్లాడుతున్నారు.
ఒకప్పుడు మన దేశంలో ఎంతో దేదీప్యమానంగా వెలి గిన సంసృత భాషను నేడు వేద పండితులు తప్ప ఇతరులు ఎవరూ నేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇంటర్మీడియేట్‌, డిగ్రీలలో సంస్కృత భాషను రెండవ భాష గా ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులు అందు కు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. కంచి కామకోటి పీఠం లాంటి పలు ఆధ్యాత్మిక సంస్థలు సంస్కృత, వేద పాఠశా లలు నెలకొల్పి సంస్కృత భాష ప్రాభవాన్ని నిలబెట్టే కృషి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సం స్కృత భాష పట్ల ఆసక్తి పెరుగుతుండగా ఆ భాషకు పుట్టి నిల్లయిన భారత్‌లో మాత్రం పరిస్థితి ఇప్పటికీ నిరాశాజన కంగానే ఉంది. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని భారత దేశానికే ప్రత్యేకమయిన సంస్కృత భాష పరిరక్షణకు దేశ వ్యాప్తంగా పాఠశాల, కళాశాల స్థాయిలలో నిర్బంధ అంశంగా చేర్చి దేవ భాష ప్రాభ వాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

  • 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News