Friday, September 20, 2024
HomeతెలంగాణKotagiri: విలేకరులపై ఇసుక అక్రమార్కుల దౌర్జన్యంగా దాడి

Kotagiri: విలేకరులపై ఇసుక అక్రమార్కుల దౌర్జన్యంగా దాడి

కోటగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

కోటగిరి మండల కేంద్రంలో విలేకరులపై దౌర్జన్యానికి పాల్పడిన అక్రమ ఇసుక మాఫియా దారులపై కోటగిరి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో వే బిల్లులు లేకుండా పొతంగల్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లను వేబిల్లులు ఉన్నాయా అని కొందరు రిపోర్టర్‌‌లు అడిగినందుకు ట్రాక్టర్‌‌ల వెనకాలే వస్తున్న ట్రాక్టర్ యజమానులు విలేకరులను ఫోటోలు తీయకుండా అడ్డుకుని, విలేకరులపై దౌర్జన్యానికి దిగారు. మీకేంటి చూపించేది మాకు వేబిల్లులు ఉండవు పర్మిషన్‌లు ఉండవు, మమ్మల్ని పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు ఏమీ చేయరని రిపోర్టర్‌‌లపై దాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన రిపోర్టర్‌‌లు ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, విలేకరులపై దౌర్జన్యానికి దిగిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News