Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan reviewed SIPB: పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ

Jagan reviewed SIPB: పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ

అన్నిరకాల పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే

రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని సీఎం జగన్ ఆదేశించారు. దీన్ని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలని, ఇప్పటికే ఇది అమల్లో ఉందని, సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుందన్నారు జగన్. ఇది సరిగ్గా అమలవుతుందా? లేదా? అన్నదానిపై సమీక్ష చేసి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలని ఆదేశించారు సీఎం. ప్రైవేటు సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలన్నారు. ఈ చట్టం అమలు అనేది అత్యంత ముఖ్యమైనది. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలోనే పరిశ్రమలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నాం. భూములు ఇతర వనరులు సమకూరుస్తున్నామన్నారు. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇది చేస్తున్నామన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు, అది సమర్థవంతంగా నడవాలంటే ఆప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరంమన్నారు. స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమని, అందుకనే ఈ ప్రభుత్వం రాగానే చట్టం తీసుకు వచ్చామన్నారు.

- Advertisement -

ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ప్రతిపాదనలు:

  1. వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం అశోక్‌ నగర్, మరియు బక్కన్నవారి పల్లె వద్ద 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు.
    ప్రాజెక్టు పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌.
    డిసెంబర్‌ 2024లో పనులు ప్రారంభానికి చర్యలు
    3314.93 మిలియన్‌ యూనిట్లు కరెంటు ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం.
    దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు
    ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం.
  2. హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ అనుబంధ సంస్థ క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు.
    225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్‌ పవర్‌ ఉత్పత్తి
    రూ.2450 కోట్ల పెట్టుబడి.
    అక్టోబరు 2023లో పనులు ప్రారంభం.
    చివరి దశ 2025 అక్టోబరు నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం.
    375 మందికి ఉద్యోగావకాశాలు.
    నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల మరియు వైఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రాజెక్టులు.

3.
విశాఖ జిల్లా అన్నవరంలో
మే ఫెయిర్‌ హెటళ్లు మరియు రిసార్టులు
రూ.525 కోట్ల పెట్టుబడి.
దాదాపు 750 మందికి ప్రత్యక్షంగా, వేయిమందికి పరోక్షంగా ఉద్యోగాలు.
నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి.
ప్రాజెక్టులో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్, 250 హోటల్‌ గదులు.
మినీ గోల్ఫ్‌ కోర్టు తదితర సదుపాయాలు
షాపింగ్‌ మాల్‌ సహా విల్లాలు.


  1. తిరుపతి పేరూరు వద్ద రూ. 218 కోట్లతో హయత్‌ ఇంటర్‌నేషనల్‌ హోటల్‌.
    260 మందికి ప్రత్యక్షంగా, 1296 మందికి పరోక్షంగా ఉద్యోగాలు.
    మూడున్నర సంవత్సరాల్లో పూర్తికానున్న ప్రాజెక్టు.

5.
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ.
రూ. 1200 కోట్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 1800 మందికి ఉద్యోగావకాశాలు.

  1. తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్‌ పుడ్‌ మరియు బెవరేజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ.
    రూ.400 కోట్ల పెట్టుబడి.
    ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు
    కాఫీని సాగుచేస్తున్న 2500 మందికి కూడా లబ్ధి.
    ఏడాదికి 16వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
  2. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్‌ ఆగ్రో రిసోర్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ ఫ్యాక్టరీ. రూ.230 కోట్ల పెట్టుబడి.
    రోజుకు 1400 టన్నులు ఉత్పత్తి.
    ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు.
    2500 మంది రైతులకూ ఉపయోగం.
  3. తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ.
    ఏడాదికి 40వేల టన్నుల తయారీ లక్ష్యం.
    రూ.168 కోట్ల పెట్టుబడి.
    250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు.
    3వేల మంది రైతులకు ప్రయోజనం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News