Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: దేవాలయం, మసీదు, చర్చ్ లను ఒకే రోజు ప్రారంభించనున్న కేసీఆర్

KCR: దేవాలయం, మసీదు, చర్చ్ లను ఒకే రోజు ప్రారంభించనున్న కేసీఆర్

సచివాలయంలో అన్ని మతాల వారికి ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి

సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్పూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రం లో గంగా జమునీ తహెజీబ్ ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా మత పెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు.


ఆగస్టు 25 వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని సిఎం పున: ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చీని సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.


ఈ మేరకు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంవో అధికారులు, ఆర్ అండ్ బి ఆధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాల పెద్దలతో సంప్రదించి వొకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సిఎం కేసీఆర్ తీసుకున్నారు. తద్వారా సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News