Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool BJP leaders met Purandheswari: పురందేశ్వరిని కలిసిన కర్నూలు జిల్లా బీజేపీ నేతలు

Kurnool BJP leaders met Purandheswari: పురందేశ్వరిని కలిసిన కర్నూలు జిల్లా బీజేపీ నేతలు

కర్నూలు బీజేపీ స్థితిగతులపై చిన్నమ్మకు వివరించిన నేతలు

కర్నూలు జిల్లా బిజెపి నాయకులు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ అక్కమ్మ తోట రామకృష్ణ పురందేశ్వరితో హైదరాబాద్ లో భేటీ అయి, శాలువా కప్పి, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి , బిజెపి సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, బిజెపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ మురాహరి రెడ్డి , విట్ట రమేష్ అయ్యా, రాఘవేంద్ర తదితరులు పాల్గొని పురందేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రధాని మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, బిజెపి పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని నాయకులకు అధ్యక్షులు తెలిపారు… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. అధ్యక్షులకు కర్నూలు జిల్లా నాయకత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తామని నాయకులు తెలిపారు..

పురందేశ్వరుని కలిసిన పురుషోత్తం రెడ్డి

దగ్గుబాటి పురందేశ్వరిని హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఆదోని డివిజన్ బిజెపి ఇన్చార్జి పురుషోత్తం రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.. పురందేశ్వరి స్వగృహంలో పురుషోత్తం రెడ్డి దంపతులు ఆమెకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి జ్ఞాపకం అందజేశారు.. ఈ సందర్భంగా ఆదోని డివిజన్లో బిజెపి పార్టీ బలోపేతంపై చర్చించారు… ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను రెడ్డి వివరించారు… మొదటిసారిగా అధ్యక్ష పదవి మహిళలకు కేటాయించడం హర్షనీయమన్నారు.. రాబోయే ఎన్నికలలో పురందేశ్వరి ఆధ్వర్యంలో పార్టీ మెరుగైన విజయం సాధిస్తుందని పురుషోత్తం రెడ్డి తెలిపారు….

పురంధేశ్వరి ను కలిసిన మురహరి రెడ్డి

ఎమ్మిగనూరు రాజకీయాలపై చర్చించేందుకు దగ్గుపాటి పురంధేశ్వరిని ఎమ్మిగనూరు బిజేపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని పురంధేశ్వరి నివాసంలో పురంధరేశ్వరిని మర్యాద పూర్వకంగా మురహరి రెడ్డి కలిసి సన్మానించారు. ఏపి రాష్ట్ర అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పురంధరేశ్వరినుి కలిసిన వారిలో ఎమ్మిగనూరు పట్టణ బిజేపి అధ్యక్షులు కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బీఎల్ నారాయణ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News