Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Sreedevamma: 30 లక్షల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Sreedevamma: 30 లక్షల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

పత్తికొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి అన్నారు. పత్తికొండ సచివాలయం-1,2 పరిధిలోని సచివాలయం క్రింద గడప-గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా మంజూరైన 20 లక్షలు, 10 లక్షల మండల నిధులతో 5,6 వార్డ్ లలో ముస్లిం వీధిలో పూర్తి అయిన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలను శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పత్తికొండ గ్రామ సర్పంచ్, కొమ్ము దీపిక ఎంపీపీ, నారాయణ దాసు, మాజీ ఎంపీపీ ఎస్ నాగ రత్నమ్మ, సంబంధితాధికారులు, పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో వైసిపి ప్రభుత్వం వచ్చాక సిసి రోడ్లు డ్రైనేజీ కాలు వలు,మంచినీటి బోర్లు గ్రామాలలో పైప్ లైన్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా నాయకులు శ్రీరంగడు వైస్ ఎంపిపి కొత్తపల్లి బలరాముడు.వైసిపి మండల కన్వీ నర్ కారం నాగరాజులు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్,సోమశేఖర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్ పాల్ భాష, పల్లె ప్రతాపరెడ్డి, పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News