Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: సర్వసభ్య సమావేశంలో కాటసాని

Banaganapalli: సర్వసభ్య సమావేశంలో కాటసాని

పెండింగ్ పనులన్నీ తక్షణం పూర్తవ్వాలని ఎమ్మెల్యే ఆదేశాలు

బనగానపల్లె పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలోని పొదుపు భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మానసవీణ, ఎంపీడీవో శివరామయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి హాజరై అన్ని శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మండలంలో ఎంత అభివృద్ధి చేశాం, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనుల గురించి ప్రజాప్రతినిధులతో తెలుసుకొని సమావేశంలో తీర్మానం చేసిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులకు ఆదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో బనగానపల్లె నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నామని, అందుకు బనగానపల్లె నియోజకవర్గం ప్రజలు అందరూ తనకు సహాయ సహకారాలు అందించడంతోనే ఇంత అభివృద్ధి చేయడానికి తనకు సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మెటికల శ్యామలాదేవి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మంగవరపు లక్ష్మీదేవి, జడ్పిటిసి సుబ్బ లక్ష్మమ్మ, బనగానపల్లె పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, మండలంలోని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News